దౌల్తాబాద్: మెట్లకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం..
చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పై 9 మంది అవిశ్వాసం.
బొంరాస్ పేట్ మండలంలోని మెట్ల కుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు ప్రస్తుత చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సహకార సంఘంలో ఉన్న 13 మంది డైరెక్టర్లు ఉండగా శుక్రవారం 9 మంది డైరెక్టర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తారు..