అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలం పరిధిలో బెలుగుప్ప, వెంకటాద్రి పల్లి గ్రామాల మధ్య ఆదివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో వెంకటాద్రిపల్లికి చెందిన ఆర్.చంద్రమౌళి (65) మృతి చెందాగా తిప్పేస్వామి అనే మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బెళుగుప్ప నుండి వెంకటాద్రి పల్లికి చంద్రమౌళి వెళ్తుండగా శీర్పి నుండి తిప్పేస్వామి ఎదురుగా వస్తూ ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను 108 వాహనంలో కళ్యాణదుర్గమ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చంద్రమౌళి మృతి చెందాడు. మృతునికి భార్య శకుంతల ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు.