పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కూటమీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిబ్యాల విజయభాస్కర్ అన్నారు. 18 నెలల్లో ఒక్క గజం స్థలం సేకరించకపోయినా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఇళ్లను తమ కృతిగా చూపించుకోవడం నిందనీయమని ఆయన పేర్కొన్నారు.జగనన్న ప్రభుత్వం హయాంలో లక్షలాది ఇళ్లను నిర్మాణ దశకు తీసుకువచ్చిందని, 2023 అక్టోబర్ 12న ఒకేరోజు 7.43 లక్షల గృహప్రవేశాలు జరిపి చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. ఇతరుల కృషిని తనదిగా చెప్పుకునే బాబు గారి “క్రెడిట్ చోరీ స్కీం” హేయమని ఆయన విమర్శించారు.