ఒంగోలు అర్బన్: కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చెయ్యాలి : కలెక్టర్
Ongole Urban, Prakasam | Jul 6, 2026
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు చెప్పారు. విబిజి రాంజీ పథకం కింద కేటాయించిన నిధులతో జిల్లాలో చేపట్టాల్సిన పనులపై సోమవారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. జలధార - జలహారతి, పొలాలలో ఇంకుడు గుంటలు, పశువుల షెడ్లు, ఇళ్లల్లో మురుగునీరు ఇంకుడు గుంటలు, సేంద్రీయ నిల్వలు, పంచాయతీరాజ్ రోడ్లు, మ్యాజిక్ డ్రైనేజీలు, ఇళ్ళ నిర్మాణంలో 90 పని దినాలు, ఉద్యానవనం, అటవీ, ప్రభుత్వ విద్యాలయాల్లో నెట్ జీరో హెల్ది క్యాంపస్ కార్యక్రమం కింద మొక్కలు నాటడం పై శ్రద్ధ పెట్టాలన్నారు