యాదగిరిగుట్ట: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం, ఉప ఆలయాలను మూసివేసిన అధికారులు
సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన, ఉప ఆలయాలను ఆలయ అధికారులు మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆలయ అధికారులు, అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేసి తిరిగి సోమవారం ఉదయం 3-30 గంటలకు సంప్రోక్షణ చేసి సుప్రభాత సేవతో పాటు బిందెతీర్థం, బాల భోగం, నిజాభిషేకం, సహస్రనామార్చన కైంకర్యాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 8-30 గంటలకు భక్తులకు సర్వదర్శనాలకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు.