పామూరు పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో సిఐ శ్రీనివాసరావు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నేపాల్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతూ పామూరు పట్టణానికి చెందిన 8 మంది నేపాల్ పోలీసులకు పట్టుబడ్డారని సీఐ తెలిపారు. పోలీసులకు పట్టుబడ్డ పామూరుకు చెందిన వారిని విచారించి, ఇంకా ఎవరైనా బెట్టింగులకు పాల్పడేవారు ఉన్నారేమో విచారణ చేపడతామన్నారు. క్రికెట్ బెట్టింగ్ చట్టరీత్యా నేరమని, అలా బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.