మంత్రాలయం:ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో సేకరించిన కోటి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.