గుత్తిలో బుధవారం పత్తి రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. రైతులు ట్రాక్టర్లు, 407 వాహనాల్లో పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే సీసీఐ అధికారులు ఏడు మంది రైతుల పత్తి నాణ్యతగా లేదని కొనుగోలు చేయడానికి తిరస్కరించారు. దీంతో రైతులు వ్యవసాయం మార్కెట్ యార్డ్ వద్ద రోడ్డుపై వాహనాల ఉంచి రాస్తారోకో నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.