అల్లూరు లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన:ఎమ్మెల్యే జయ సూర్య, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి శివానందరెడ్డి
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి శ్రీ మాండ్ర శివానందరెడ్డి నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య హాజరై రిబ్బన్ కట్ చేసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు,ఈ సందర్భంగా నాయకులు మాండ్ర శివానందరెడ్డి ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు మాట్లాడుతూ అల్లూరు గ్రామ అభివృద్ధికి (1) గ్రామ ప్రజల కలగా ఉన్న 24 గంటల నిరంతర కరెంటు సరఫరా కొరకు సబ్స్టేషన్ నిర్మాణం చేయుటకు 3 కోట్ల 90 లక్షలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టి పూర్తిచేసి ఈరోజు గ్రామ ప్రజలకు అంకితం చేయడం జరిగింది