డోన్: కర్నూలు డోను బుల్లెట్ రైల్వే స్టేషన్లు..?
Dhone, Nandyal | May 8, 2026 హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) కర్నూలు జిల్లా మీదుగా దూసుకెళ్లనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా కర్నూలు, డోన్లో బుల్లెట్ రైలు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలు అందుబాటులోకి వస్తే, హైదరాబాద్-బెంగళూరుకు కేవలం 2.30 గంటల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం సర్వే పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.