కనిగిరిలోని శివనగర్ కాలనీలో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ బుధవారం తనిఖీ చేశారు. హాస్టల్లోని వసతులను ఆయన పరిశీలించారు. బాలికల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరిన దృష్ట్యా అధికారులు నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ కోరారు. శీతాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రజలే అవకాశం ఉందని బాలికలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.