తాడిపత్రిలో ఆదివారం రాత్రి మాదిగల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు దివిటీలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పెద్దిరాజు, రామ్మోహన్ మాదిగ ఆధ్వర్యంలో దివిటీలతో ర్యాలీ నిర్వహించారు. మాదిగ అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. సుమారు గంటన్నర పాటు దివిటీల ర్యాలీ నిర్వహించారు.