బనగానపల్లె: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో శిథిలావస్థకు చేరుకున్న మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు కూల్చివేత
బనగానపల్లెలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్, టంగుటూరు, కొత్తపేట గ్రామాల్లో కొన్నేళ్ల క్రితం నిర్మించిన తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్లు శిథిలస్థితికి చేరాయి. ఈ సమస్య స్థానికులు, అధికారులు ద్వారా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఆయన ఆదేశాలతో ఈ ట్యాంక్లను బుధవారం కూల్చినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారి డీఈ మధుసూదన్, ఏఈ సాయికృష్ణ చెప్పారు. ప్రజల అవసరాలకు త్వరలో కొత్తవి నిర్మిస్తామన్నారు.