ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో 50 శాతానికి పైగా పొగాకు బేళ్లను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. బోర్డు పరిధిలోని పొగాకు రైతులు 1450 పొగాకు బేళ్లను వేలానికి తీసుకురాగా నాణ్యత లోపంతో వాటిలో సగానికి పైగా తిరస్కరించినట్లుగా తెలిపారు. రైతులు మాత్రం అధికారులు తిరస్కరించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం నాణ్యత లోపంతోటే పొగాకును తిరస్కరించినట్లు వెల్లడించారు.