బనగానపల్లె: ప్రతి ఒక్క ఓటరు విధిగా మ్యాపింగ్ చేయాలి : సంజామల తాసిల్దార్ చంద్రశేఖర్
నంద్యాల జిల్లా సంజామల మండల పరిధిలోని ముదిగేడులో BLOల ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను గురువారం తహశీల్దార్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఓటర్ల మ్యాపింగ్, వివరాల నమోదు పనులను తనిఖీ చేసి, BLO గుర్రప్పకు పలు సూచనలు చేశారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా అర్హులైన ప్రతి ఓటరును విధిగా మ్యాపింగ్ చేసి, ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలన్నారు.