అన్నమయ్య జిల్లా రాయచోటి : కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏడాది క్రితం కువైట్ వెళ్లిన శిరీష అక్కడ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన జిల్లా వ్యాప్తంగా విషాదాన్ని నెలకొల్పింది. కువైట్లోని జహ్రా ప్రాంతంలో పనిమనిషిగా పనిచేస్తున్న మద్దెలవాండ్లపల్లి గ్రామానికి చెందిన గున్నికుంట్ల శిరీష (35) గత 10వ తేదీ అర్ధరాత్రి మృతి చెందినట్లు సమాచారం వచ్చింది.ఈ ఘటనపై మృతురాలి భర్త మల్లికార్జున తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. గ్యాస్ పేలుడు వల్ల మృతి చెందిందని, ఆత్మహత్య చేసుకుందని కువైట్ నుంచి భిన్నమైన సమాచారం వచ్చినా, వాటిని నమ్మలేమని ఆయన తెలిపారు.