అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటుకలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాలను విశ్వవిద్యాలయం నందు మంగళవారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో ఎస్కే యూనివర్సిటీ రిజిస్టర్ రమేష్ బాబు యూనివర్సిటీ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి నూతనంగా నిర్మిస్తున్న ల్యాబ్ గదులను రీడింగ్ రూములను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రిజిస్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థినిలకు మెరుగైన విద్యను అందించేందుకు ల్యాబ్ గదులు రీడింగ్ రూములు నిర్మిస్తున్నామని వీటిని నాణ్యతతో నిర్మించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించడం జరిగిందని ఎస్కే యూనివర్సిటీ రిజిస్టర్ రమేష్ బాబు పేర్కొన్నారు.