నంద్యాల అర్బన్: నంది పల్లెకు వెళ్లే రహదారిలో రెండు రోజులు రాకపోకలు బంద్
Nandyal Urban, Nandyal | Apr 21, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లి వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా రెండు రోజులు వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రైల్వే లైన్ డబ్లింగ్ పనుల నేపథ్యంలో మంగళవారం తమడపల్లి సమీపంలోని సూర్య నంది ఆర్చి వద్దనే వాహనాలను నిలిపివేస్తున్నారు. రోడ్డు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్పును గమనించి వాహనదారులు సహకరించాలని వారు కోరారు.