సమాజంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాలు పరిశుభ్రత పాటిస్తే అనారోగ్యాలు దరి చేరవు అని బెలుగుప్ప ఎంపీడీవో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని లక్ష్మీ నగర్ కాలనీలో ప్రజలకు పరిసరాలు పరిశుభ్రత పై అవగాహన కల్పించి ఎన్జీవో సంస్థ సాహాస్ ప్రతినిధులు స్థానిక టిడిపి నాయకులు పార్టీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున పంచాయితీ సెక్రెటరీ మంజునాథ లతో కలిసి బెలుగుప్ప కాలనీవాసులకు తడి చెత్త వేసు కోవడానికి బుట్టలను పొడి చెత్త వేసుకోవడానికి బ్యాగులను పంపిణీ చేశారు. బెలుగుప్ప తగ్గుపర్తి గ్రామాల్లో సుమారు 2000 కుటుంబులకు బుట్టలను అందిస్తామన్నారు