అనంతపురం అర్బన్: కియా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 8, 2026
శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ సమీపంలో ఉన్న కియా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దేవకృపాకర్ అనే వ్యక్తి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.