రైతులు పాలీహౌస్ వ్యవసాయ విధానాన్ని అవలంబించడంతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సూచించారు. పాలీహౌస్ సాగుపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాలీహౌస్ సాగుకు ప్రభుత్వం ఏ మేరకు ప్రోత్సాహకాలు ఇస్తుందో రైతులకు వివరించారు. ప్రతి రైతు పాలీహౌస్పై దృష్టి పెట్టాలని సూచించారు.