ఆళ్లగడ్డ: సమాచార హక్కు చట్టం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ చైతన్య రాయలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ చైతన్య రాయలు సూచించారు శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిర్వహించిన, సమాచార హక్కు సదస్సులో ఆయన మాట్లాడారు, ఈ చట్టం పారదర్శకతను పెంచి అవినీతి రహిత పలుకు దోహదపడుతుందని పేర్కొన్నారు ప్రజలు చైతన్యం పొంది తమ హక్కులను వినియోగించుకోవాలని కోరారు, చట్టం ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని పొందే విధానాన్ని గురించి అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమంలో స్టాంప్ రైటర్లు ప్రజలు పాల్గొన్నారు