బనగానపల్లె: నంద్యాల జిల్లాలో చల్లబడ్డ వాతావరణం
వేసవి కాలం ప్రారంభం నుంచి ఈ ఏడాది పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోయి ప్రజలు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. కానీ గురువారం అర్ధరాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తారు వర్షం కురిసింది. దీనికి తోడు శుక్రవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండి చల్లగాలులు వీస్తుండటంతో వాతావరణం చల్లబడింది. మండే ఎండలతో అల్లాడుతున్న జిల్లా ప్రజలకు ఉపశమనం లభించింది.