పెద్దవూర: నాగార్జునసాగర్ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తిన అధికారులు
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు 14 గేట్లను అధికారులు ఎత్తినట్లు మంగళవారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు ఎగువ ప్రాంతాల నుంచి వర్గ ప్రవాహం కొనసాగుతుండడంతో గేట్లను ఎత్తినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం 588.40 అడుగుల వద్ద ఉందన్నారు. ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 1,62,318 క్యూసెక్కులుగా కొనసాగుతున్నాయన్నారు. జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి జరుగుతుందన్నారు.