అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కరణం పుష్పావతి అధ్యక్షతన ఎంపీడీవో సత్యబాబు ఆధ్వర్యంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు అధికారులను రైతు సమస్యలపై నిలదీశారు. ప్రభుత్వం రబీ సీజన్ ముగుస్తున్న రాయితీ పప్ప సెనగ పంపిణీ చేపట్టకపోవడం ఏమిటని, యూరియా పంపిణీ అస్తవ్యస్తంగా ఉండటం పైన ప్రభుత్వం ప్రచార అర్బటాలే తప్ప ప్రజలకు చేస్తుంది శూన్యం అంటూ వైయస్సార్సీపి ప్రజా ప్రతినిధులు సభలో అధికారులను ఎద్దేవా చేశారు.