కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు -కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులో ఉన్న హనుమంతరాయుడు, కళావతి తోపాటు డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనస్థలికి చేరుకున్నారు. కారు లో ఇరక్కపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటికి తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.