ప్రకాశం జిల్లాలో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరుఅందించ డానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుండి జల సురక్ష, స్కబ్ టైఫస్ జ్వరాలు, ప్రధాన మంత్రి సూర్యఘర్, గృహనిర్మాణాలు, క్యాటిల్ షేడ్స్ నిర్మాణాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై జిల్లాకలెక్టర్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు త్రాగునీ సురక్షితమైన త్రాగునీరు అందించ డానికి జలసురక్ష మాసంగా దీనిని చూడాలన్నారు