అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో శనివారం సాయంత్రం 5 గంటలకు మండల తహసిల్దార్ అనిల్ కుమార్ పౌర హక్కుల పరిరక్షణ దినోత్సవ కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎస్ఐ శివ, వివిధ శాఖల మండల అధికారులతో కలిసి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టాలను ఎవరు దుర్వినియోగపరచరాదని ఎలాంటి సమస్యనైనా పోలీసులకు తెలియజేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలు సోదరభావంతో మెలగి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఓ ఆర్ డి గోపాల్, వీఆర్వో శ్రావణి, టిడిపి గ్రామ కన్వీనర్ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.