అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని వెంకటాద్రి పల్లి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ఉదయం నుండి సాయంత్రం 4:30 గంటల వరకు వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులతో స్కూల్ గేమ్స్ అండర్ 14 17 విభాగాల్లో కబడ్డీ పోటీలు మండల స్థాయిలో పోటాపోటీగా జరిగాయి. వివిధ ఉన్నత పాఠశాలల వీటిలో గోపాల్ రెడ్డి రాఘవేంద్ర కోటప్పల పర్యవేక్షణలో కబడ్డీ పోటీలు జరిగాయి. అందరూ 14 బాలుర విభాగంలో కాలువపల్లి అంకంపల్లి బెలుగుప్ప, అండర్ 17 విభాగంలో వెంకటాద్రిపల్లి బెలుగుప్ప కాలువపల్లి, అండర్ 14 విభాగం బాలికల్లో కాలువపల్లి అంకంపల్లి కోనంపల్లి జట్లు విజేతలుగా నిలిచాయి.