కర్నూలు: రేపు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం: కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ
కర్నూలు నగర పరిధిలో ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు గురువారం ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ బుధవారం ఉదయం 11 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 09:00 గంటల నుండి 10:00 గంటల వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, నగర ప్రజలు తమ కాలనీల్లో స్థానిక సమస్యలను ఫోన్ ద్వారా నేరుగా తెలియజేయవచ్చని సూచించారు. తాగునీటి సమస్యలు, వీధి దీపాల మరమ్మతులు, రహదారుల మరమ్మతులు, పారిశుద్ధ్య సమస్యలు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.