వెలిగండ్ల మండలంలోని మరపగుంట్ల గ్రామంలో తహసిల్దార్ వాసు ఆధ్వర్యంలో గురువారం గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా 453 మంది రైతులకు తహసిల్దార్ వాసు పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. తహసిల్దార్ మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రాజముద్రలతో కూడిన క్యూఆర్ కోడ్ కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తున్నన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా రైతులు తమ పొలాలను సులభంగా గుర్తించడంతోపాటు హద్దులు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.