మార్కాపురం జిల్లా రాచర్ల పట్టణంలో సోమవారం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై ఎస్ఐ కోటేశ్వరరావు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు రోడ్డుకు తల బలంగా తగిలితే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేకపోతే భారీ జరిమాణాలు విధిస్తామని కోటేశ్వరరావు అర్హతలను తీవ్రంగా హెచ్చరించారు.