మంత్రాలయం:శ్రీ మంచాలమ్మ దేవర సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చే నేపథ్యంలో ఆదోని జిల్లా సాధనకై మంత్రాలయంలో కొనసాగుతున్న ఆరవ రోజు దీక్షను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు జేఏసీ కన్వీనర్ రామతీర్థం అమ్రేశ్ బుధవారం తెలిపారు. డిసెంబర్ 18వ తేదీ నుంచి దీక్షను యథాతధంగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీలకతీతంగా జిల్లా సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.