మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వైసిపి కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసిపిని వీడి టిడిపిలో చేరినట్లుగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు తెలిపారు.