ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గురువారం కనిగిరి-హనుమంతునిపాడు రహదారిలో నూతన సంవత్సర వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసేందుకు కనిగిరి నియోజకవర్గంలో పాటు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి టిడిపి నాయకులు, కార్యకర్తలు వాహనాలలో భారీగా తరలిరాగా కనిగిరి-హనుమంతునిపాడు రహదారిలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎట్టకేలకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.