ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపర్చే కేంద్ర ప్రభుత్వ బిల్లుకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నిరసన చేపట్టారు. బిల్లును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడారు. పేదలు, కూలీల జీవనాధారాన్ని దెబ్బతీయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.