అనంతపురం నగర శివారులోని రాప్తాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 12, 2026
అనంతపురం నగర శివారులోని రాప్తాడు సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన గగన్ గీతాంష్ (05); అని ఐదేళ్ల చిన్నారి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శోధన పల్లి కి చెందిన చిన్నారి తన తల్లితో కలిసి వివాహ వేడుకల్లో హాజరై తిరిగి గ్రామానికి వెళుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.