ఒంగోలు అర్బన్: నిబంధనలు కనుగుణంగా లేని స్కూల్ బస్సులను సీజ్ చేయడం జరుగుతుంది : ఉప రవాణా కమిషనర్
Ongole Urban, Prakasam | May 7, 2026
నిబంధనలకు అనుగుణంగాలేని విద్యాసంస్థల బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని ఉప రవాణా కమిషనర్ ఆర్ సుశీల హెచ్చరించారు. గురువారం ఆమె మాట్లాడుతూ విద్యాసంస్థలకు చెందిన 744 బస్సులు జిల్లాలో ఉన్నాయని అందులో ఇప్పటివరకు 148 బస్సులను తనిఖీలు చేయడం జరిగిందని ఆమె తెలిపారు ఏఐఎస్ 63 నిబంధనలకు అనుగుణంగా లేనటువంటి 48 బస్సులను సరి చేసుకోవాలని తిప్పి పంపడం జరిగిందన్నారు పాఠశాలలు ప్రారంభించే సమయానికల్లా బస్సులను ఏటిఎస్ సెంటర్ నందు ఫిట్నెస్ చేయించుకుని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో తనిఖీలకు హాజరుకావాలని ఆమె హెచ్చరించారు ఇప్పటికే పాఠశాల సిబ్బందికి నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు