కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.సుధాకర్ ఓర్వకల్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నమడకలలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీపీఎస్లో అమలవుతున్న ఎఫ్ఎల్ఎన్ పరీక్షలను పరిశీలించి సూచనలు చేశారు. డీఈఓ విద్యార్థులతో మాట్లాడి 100 రోజుల ప్రణాళిక అమలు తీరును తెలుసుకున్నారు. ఫిజికల్ సైన్స్ స్లిప్ టెస్ట్-2ను కూడా పరిశీలించారు. అనంతరం ఓర్వకల్ ఎంఆర్సి కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో శ్రీధర్ బాబు, మండల విద్యాధికారి ఓంకార్ యాదవ్ పాల్గొన్నారు.