ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కొంగలవీడు రోడ్డు లో ఉన్న ఈశ్వరమ్మ ఆలయ ప్రధమ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు స్వీకరించారు. తర్వాత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈశ్వరి దేవి అమ్మవారి పల్లకిని మూసి భక్తిని చాటారు. తర్వాత ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.