తిప్పర్తి: పట్టణంలో గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల చెడిపోకుండా యువతను చైతన్యం చేయడం కోసం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర
గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ల బారిన పడి యువత చెడిపోకుండా చైతన్యం చేయడం కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన యువ చైతన్య సైకిల్ యాత్ర గురువారం ఉదయం నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రానికి చేరుకుంది. వారికి సిపిఎం, సిఐటియు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ డివైఎఫ్ఐ మండల కార్యదర్శి కేసని ఈశ్వర్ స్థూపం వద్ద నివాళులర్పించి అనంతరం మోడల్ స్కూల్లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్ల మహేష్ మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలన్నారు.