పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా, *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు,* ఏఆర్ డిఎస్పీ శ్రీ యం. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం రాయచోటి పట్టణంలోని "డైట్" కళాశాలలో పోలీస్ పిల్లలకు మరియు పోలీస్ సిబ్బందికి వక్తృత్వం మరియు వ్యాసరచన పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.పోలీస్ పిల్లల కోసం “మహిళలు మరియు పిల్లలను లైంగిక దాడుల నుండి రక్షించడంలో విద్యార్థుల పాత్ర” అనే అంశంపై, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి “ప్రస్తుత కాలంలో పోలీసింగ్లో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర” అనే అంశంపై పోటీలు నిర్వహించబడ్డాయి.