అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఆర్డిటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో డిసెంబర్ 17 నుంచి 21 వరకు 79వ సంతోష్ ఫుట్ బాల్ మ్యాచులు నిర్వహించబోతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం ఐదున్నర గంటల సమయంలో ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు డిసెంబర్ 17 నుంచి 21 వరకు సంతోష్ ట్రోఫీ 2025 26 గ్రూప్ జి లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి అండమాన్ ఫుట్బాల్ టీములు మధ్య మ్యాచులు ఆర్డిటి కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం ఒక ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించారు.