పిట్లం: పిట్లంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
పిట్లంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు.... దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ చేసిన సేవలను మరువలేమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు మండల కేంద్రంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంబిగే హన్మండ్లు కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బొడ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.