కర్నూలు: ఢిల్లీలో భారీ పేలుడు సంఘటన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన: కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్
ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సోమవారం రాత్రి 7 గంటలకు కర్నూలు జిల్లా లో ఏకకాలంలో ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ ప్రజల భద్రత , శాంతి భద్రతల పరిరక్షణే ద్యేయంగా కర్నూలు, గుత్తి పెట్రల్ బంక్ వద్ద ఆకస్మికంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. భారీ పేలుడు సంఘటన నేపథ్యంలో, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు బృందాలు విస్తృతంగా తనిఖీలు ముమ్మరం చేశారు.