ఒంగోలు అర్బన్: మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి 20,65,000 ఇన్సురెన్స్ చెక్కును అందజేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Jun 11, 2026
ఆక్సిడెంట్ లో మృతి చెందిన బాధిత పోలీస్ కుటుంబానికి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (GPAI) చెక్కును గురువారం జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అందచేసినారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు మార్చి 28న మృతి చెందిన జె.వెంకట రమణయ్య, HC.453 సతీమణి జె. శ్రీలక్ష్మి కి రూ. 20,65,000/- చెక్కును అందచేసినారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యుల యోగక్షేమాలు, పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందడం బాధాకరమన్నారు.