పామూరు పట్టణంలో సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు మరియు యువత సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ... ప్రజల్లో ఆరోగ్యవంతమైన జీవనశైలి, రోడ్డు భద్రత నియమాలు, వాటి ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించేందుకు పోలీసులు, యువతతో కలిసి సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.