బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో విద్యుత్ షాక్ తో రజకుడి మృతి
బట్టలు ఉతకడానికి దోబీ ఘాట్కు వెళ్లిన రజకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందిన ఘటన కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లెలో చోటుచేసుకుంది. సీఐ రమేశ్ బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రామాంజనేయులు(55) బట్టలు ఉతకడానికి గ్రామ సమీపంలోని దోబీ ఘాటు వెళ్లాడు. మోటార్పై పడటంతో విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.