గుంతకల్లు: రోగులతో గుత్తి ప్రభుత్వాసుపత్రి కిటకిట, 600 దాటిన అవుట్ పేషెంట్ల సంఖ్య
గుత్తి ప్రభుత్వాసుపత్రి బుధవారం రోగులతో కిక్కిరిసిపోయింది. అవుట్ పేషెంట్ల సంఖ్య 600 దాటింది. సాధారణంగా ప్రతిరోజు 300 నుంచి 350 మంది ఔట్ పేషెంట్లు వచ్చేవారు. అయితే ఆ సంఖ్య కాస్త విపరీతంగా పెరిగి 600 దాటింది. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వైద్యుల నియామకం చేయాల్సి ఉంది. కేవలం 7 మంది మాత్రమే వైద్యులు ఉన్నారు. 12 మంది వైద్యులు ఉండాలి. వైద్యులు నియమించాలని రోగులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.