జర్మనీ నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం జరిగింది. శిక్షణ, వీసా, ఉద్యోగం పేరుతో రూ. లక్షలు వసూలు చేశారంటూ యువత నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. రూ.కోటి రూపాయలకు పైగా వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తిరిగి చెల్లించాలని బుధవారం మూసారాంబాగ్ లోని కన్సల్టెన్సీ ముందు ఆందోళన చేపట్టారు. మలక్పేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు